137వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూలు


విజయవాడ : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర137వ రోజు షెడ్యూల్ విడుద‌లైంది.  ఆదివారం ఉదయం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విజ‌య‌వాడ న‌గ‌రం నుంచి త‌న పాదయాత్ర ప్రారంభిస్తారు. అంబాపురం, జక్కంపూడి మీదుగా కొత్తూరు తాడేపల్లి చేరుకుంటారు. అనంతరం లంచ్‌ విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. కొత్తూరు, వెలగలేరు మీదుగా ముత్యాలంపాడు క్రాస్‌ చేరుకొని పాదయాత్ర ముగిస్తారు.  
 
Back to Top