ముంపు ప్రాంతాల్లో బాలినేని సహాయ చర్యలు

ఒంగోలు, 24 అక్టోబర్ 2013:

భారీ వర్షాల కారణంగా జలదిగ్బంధంలో చిక్కుకున్న ఒంగోలు నగరంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విప్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి సహాయ చర్యలు చేపట్టారు. గురువారం ఉదయాన్నే ఆయన నగరంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న బాధితులను ఆయన దగ్గర ఉండి పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితులకు భోజన ఏర్పాట్లు చేయాలని బాలినేని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. కొనకనమెట్ట మండలం వెదురురాళ్లపాడు సమీపంలోని వాగులో చిక్కుకున్న బస్సులో చిక్కుకున్న ‌ముగ్గురు ప్రయాణీకులను రక్షించిన అధికారులను బాలినేని అభినందించారు. ఆ బస్సులో మిగతా నలుగురు ప్రయాణికులను కూడా రక్షించాలని అధికారులను కోరారు.

Back to Top