పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
దీక్షకు అడ్డంకులు సృష్టిస్తే...!
06 Oct 2015 2:22 PM
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదని తిరుపతి వైఎస్ఆర్ సీపీ ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్రంలో తమ మంత్రులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగ సమస్య తీరుతుందని వరప్రసాద్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు నిలవాల్సింది పోయి అడ్డంకులు సృష్టించడం పట్ల ప్రభుత్వంపై మండిపడ్డారు.