దీక్షకు అడ్డంకులు సృష్టిస్తే...!

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదని తిరుపతి వైఎస్ఆర్ సీపీ ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్రంలో తమ మంత్రులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 

ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగ సమస్య తీరుతుందని వరప్రసాద్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు నిలవాల్సింది పోయి అడ్డంకులు సృష్టించడం పట్ల ప్రభుత్వంపై మండిపడ్డారు.
Back to Top