రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
బాబు..శేఖర్రెడ్డిల సంబంధాలపై ఆధారాలున్నాయి
17 Apr 2018 1:05 PM
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు శేఖర్ రెడ్డితో ఉన్న సంబంధాలపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని బొత్స వెల్లడించారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో బొత్స సత్యనారాయణ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నోట్ల రద్దు సందర్భంగా చంద్రబాబు తన ద్వారా రూ.500 కోట్ల రూపాయల నల్లధనాన్ని మార్చుకున్నారని శేఖర్ రెడ్డి సిబిఐ కి వాంగ్మూలం ఇచ్చినట్లు బొత్స చెప్పారు. సిబిఐ నివేదిక బయట పడితే చంద్రబాబుతో శేఖర్ రెడ్డి కి ఉన్న లింకు బయటపడుతాయని ఆయన పేర్కొన్నారు. శేఖర్ రెడ్డితో చంద్రబాబు సంబంధాలపై జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణ చేసి, ఆ తరువాత మౌనంగా ఉన్నారన్నారు. తాను ఈ విషయం పై ఆరా తీస్తే చాలా వాస్తవాలు బయట పడ్డాయని బొత్స వ్యాఖ్యానించారు.