కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
చంద్రబాబుకు ఓటుకు నోటు కేసు భయం
06 Nov 2018 1:26 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మండిపడ్డారు. కాంగ్రెస్తో చంద్రబాబు మైత్రీబంధంపై ట్విటర్లో స్పందించారు. ‘ఎంత డబ్బు అయినా పంపిస్తా, టీఆర్ఎస్ మాత్రం గెలవొద్దంటూ తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నాడట. ఇంత ప్రేమ ఎందుకంటే కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఓటుకు నోటు కేసు విచారణ స్పీడప్ చేసి ఎక్కడ లోపల వేస్తాడోనని చంద్రబాబుకు భయం పట్టుకుంద’ని ఎద్దేవా చేశారు.
ఐటీ సోదాల నుంచి రక్షణ పొందేందుకే చంద్రబాబు రాహుల్ గాంధీతో చంద్రబాబు పూసుకు తిరుగుతున్నారని విజయసాయిరెడ్డి అంతకుముందు ఆక్షేపించారు. జాతీయస్థాయి నాయకుడినని ఐటీ శాఖను బెదిరించాలని చూస్తున్నారని విమర్శించారు. చిదంబరం, రాబర్ట్ వాద్రాలే అక్రమ సంపాదన కేసుల్లో ఇరుక్కుని ఉన్నారని, రాహులేం కాపాడతారని ఎద్దేవా చేశారు.
‘తిత్లీ తుపాను సాయం స్వాహా చేసే మోసగాళ్లను కఠినంగా శిక్షిస్తాం అంటూ బాబు నిన్న దిక్కులు పిక్కటిల్లేలా గర్జించాడట. సాయాన్ని అక్రమంగా నొక్కేసిన పచ్చ చొక్కా తమ్ముళ్లు పక్కకు తిరిగి ఫక్కున నవ్వారట. బాబు వార్నింగ్లు, హూంకరింపులు ఉత్తిత్తివే అన్నది వారికి బాగా తెలుసు కాబట్టి.’ అని విజయసాయి రెడ్డి ట్విటర్లో బాబుపై జోకులు పేల్చారు.