<strong>స్వార్థ రాజకీయాలతో రాష్ట్రానికి తీవ్ర ద్రోహం..</strong><strong>ప్రత్యేకహోదాపై చిత్తశుద్ధితో పోరాటాలు చేసింది వైయస్ఆర్సీపీనే...</strong><strong>వైయస్ఆర్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి</strong>స్వార్థ రాజకీయాల కోసం టీడీపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత,మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. విజయవాడ వైయస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, యనమల మా పదవులు త్యాగం గురించి మాట్లాడితే అశ్చర్యం కలుగుతుందన్నారు. జగన్,పవన్ మోదీని ప్రశ్నించడంలేదంటారని నాలుగు సంవత్సరాలుగా బీజేపీతో టీడీపీ భాగస్వామ్య పార్టీగా ఉండి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా స్వార్థ రాజకీయాలు కోసం ద్రోహం చేసిన వ్యక్తులు మా రాజీనామాలపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు..రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం చిత్తశుద్ధితో రాజీనామాలు చేశామన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ప్రత్యేకహోదా సాధించడంలో విఫలమయ్యిందన్నారు. కేంద్ర,రాష్ట పార్టీలు భాగస్వామ్యులుగా ఉండి ప్రజలచేత ఓట్లు వేయించుకుని మళ్లీ బీజేపీ నుంచి బయటకు వచ్చి నెపం కేంద్రంపై వేసి ప్రత్యేకహోదా కోసం టీడీపీ చేస్తున్న డ్రామాలకు నిరసనగా రాజీనామాలు చేశామన్నారు. పార్లమెంటు సాక్షిగా పోరాటం చేసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. మా పదవులు రాజీనామా గురించి చంద్రబాబు,యనమలకు మాట్లాడే అర్హత లేదన్నారు. చంద్రబాబుది వెన్నుపోటు నైజమన్నారు. ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రకు వెన్నుపోటు పోడిచిన ఘనత చంద్రబాబు నాయుడిదే అని అన్నారు. చిత్తశుద్ధితో ప్రత్యేక హోదాపై పోరాటాలు చేసింది వైయస్ జగన్,వైయస్ఆర్సీపీ పార్టీలన్నారు. 23 మంది ఫిరాయింపుదార్లపై చర్య తీసుకుంటే ఎన్నికలు వచ్చేవి కాదా అన్నారు. బుట్టా రేణకపై చర్య తీసుకోమని ఫిర్యాదు చేశామని ఆ విషయంలో చర్య తీసుకున్నా ఎన్నికలు వచ్చేవన్నారు. పగలు కాంగ్రెస్, రాత్రి బీజేపీతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడు మాకు మిత్రుడే అని పార్లమెంట్ సాక్షిగా రాజ్నాథ్సింగ్ చెప్పారని గుర్తుచేశారు. ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయించారన్నారు. చంద్రబాబు కోట్లు దోచుకున్న ఆయనపై దాడులు జరగవని విమర్శించారు. దోచుకున్న వ్యక్తులే ఐటిదాడులు జరిగితే కుట్ర అంటూ ప్రచారం చేస్తారన్నారు. హోదా కోసం గుంటూరులో 8 రోజులు వైయస్ జగన్ ఆమరణ దీక్ష చేస్తే భగ్నం చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. వైయస్ఆర్సీపీ బీజేపీతో కలిసి వుంటే వైయస్ భారతీపై ఎందుకు కేసులు పెడతారని ప్రశ్నించారు. ప్రజలు గమనిస్తున్నారని టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. వంగవీటి రాధా వైయస్ఆర్సీపీలోనే ఉన్నారని, అనుమానాలకు తావులేదన్నారు. పార్టీ బలబలాలు బట్టి సీటు కేటాయింపులు, మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. ప్రజల మనోభావాలు తెలుసుకునే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.<br/>