<br/>తిరుపతి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఓ చరిత్ర అని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనపై వైయస్ఆర్ పాదయాత్ర ఓ దండయాత్ర అని అభివర్ణించారు. ఏ ఒక్కరికి మేలు చేయకుండా తొమ్మిదేళ్లు అన్యాయంగా పాలన సాగిస్తున్న సమయంలో ప్రజలకు అండగా ఉండేందుకు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టారన్నారు. మహానేత పాదయాత్ర దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపిందన్నారు.