రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
సమైక్యాంధ్ర తీర్మానమే మా ప్రధాన డిమాండ్
12 Dec 2013 10:18 AM
హైదరాబాద్, 12 డిసెంబర్ 2013:
సమైక్యాంధ్ర తీర్మానమే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్ అని పార్టీ గౌరవ అధ్యక్షురాలు, శాసనసభా పక్ష నాయకురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ స్పష్టం చేశారు. హైదరాబాద్లో గురువారం ఉదయం శ్రీమతి విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభలో సమైక్యాంధ్ర తీర్మానం జరిగితేనే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కలసిరావాలని ఆమె అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడుతున్న విషయాన్ని శ్రీమతి విజయమ్మ ఈ సందర్బంగా గుర్తుచేశారు. సమైక్యాంధ్ర కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతున్నారని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని 75 శాతం మంది ప్రజలు సమైక్యాంధ్రనే వినిపిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచాలని కోట్లాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని శ్రీమతి వైయస్ విజయమ్మ పేర్కొన్నారు.