<br/> ప్రకాశం: ప్రత్యేక హోదా సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నాకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో వైయస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులకు, సీపీఎం, సీపీఐ, ఆప్ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. <br/>‘‘ఢిల్లీ ధర్నాలో పాల్గొన్న వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాధాలు. ప్రధాని మోదీగారు ఈ ఆందోళనలను పరిగణలోకి తీసుకుని, ఏపీ హక్కు ప్రత్యేక హోదా ప్రతిపత్తిని కల్పిస్తారనే నమ్మకముంది’’ అని వైయస్ జగన్ ట్వీట్ చేశారు. <br/>