హైదరాబాద్: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్తో ఆలిండియా క్రిస్టియన్ ఫెడరేషన్(ఏఐసీఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 14న రాజమండ్రిలో తలపెట్టిన దళిత క్రైస్తవ గర్జనకు సంబంధించిన పోస్టర్ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్ సరైనదే అని వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తమ డిమాండ్ల పట్ల వైయస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఏఐసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు విజయరాజు తెలిపారు.