రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
ప్రజా సంకల్ప యాత్ర @2700 కిలోమీటర్లు
11 Aug 2018 4:11 PM
తూర్పు గోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో శనివారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అశేష జనవాహిని వెంట నడువగా తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర 2700 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైయస్ జగన్ గుర్తుగా అక్కడ ఒక మొక్కను నాటారు.2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా ఆయన జూన్ 12న తూర్పుగోదావరి జిల్లాలో అడుపెట్టారు. కాగా, ఇవాళ వైయస్ జగన్ పాదయాత్ర 234వ రోజు 103వ నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. సాయంత్రం తుని పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.