గుంటూరు : ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ’సాక్షి’ 10వ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా కావూరు శివారులో కేక్ కట్ చేశారు. విలువలకు కట్టుబడి.. పాత్రికేయ ధర్మాన్ని నిబద్ధతతో కొనసాగిస్తున్న సాక్షికి.. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైయస్ జగన్ శుభాభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, ఫొటోగ్రాఫర్లు, అభిమానులు పాల్గొన్నారు. <br/>