ఇస్త్రో శాస్త‌వేత్త‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

 

గుంటూరు : పీఎస్‌ఎల్‌వీ సీ-41 రాకెట్‌ ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ల‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇస్త్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు అభినంద‌న‌లు తెలిపారు .  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి గురువారం వేకువజామున 4.04 గంటలకు రాకెట్‌ ప్రయోగం జరిగింది.  19.19 నిమిషాల తర్వాత రాకెట్‌ లక్ష్యాన్ని చేరుకుంది. నాలుగు దశల అనంతరం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఐ ఉపగ్రహం నిర్ణయించిన సమయానికి విడిపోయి కక్ష్యలోకి ప్రవేశించింది.  వాహనాల గమనాన్ని పరిశీలించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఈ ఉపగ్రహం ద్వారా సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులకు చాలా ఉపయోగం కలగనుంది. ఈ ఉపగ్రహం వల్ల దృశ్య, వాయిస్‌ దిక్సూచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. భ‌విష్య‌త్తులో మ‌రెన్నో విజ‌యాలు సాధించాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు. 

తాజా వీడియోలు

Back to Top