<br/>విశాఖ: సీనియర్ పాత్రికేయులు కుల్దీప్ నయ్యర్ మృతి పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుల్దీప్ నయ్యర్ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 1923 ఆగస్టు 14న పాక్లోని సియోల్కోట్లో జన్మించిన నయ్యర్ పలు పత్రికలకు వ్యాసాలు రాశారు.