వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టీడీపీయే అసలు సిసలైన ‘తెలుగు కాంగ్రెస్'
13 Mar 2015 5:59 PM
హైదరాబాద్: శాసనసభలో టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం నిప్పులు చెరిగారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై అభాండాలు వేయడం తగదని హితవు పలికారు. మహానాయకుడు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనకు, టీడీపీ ప్రభుత్వానికి పోలికా? అని ఎద్దేవా చేశారు. తమ పార్టీపై అవాకులు చవాకులు పేలడం మానాలన్నారు. తాము దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులమే తప్ప కాంగ్రెస్కు కాదని తేల్చిచెప్పారు. టీడీపీయే అసలు సిసలైన ‘తెలుగు కాంగ్రెస్’ అని అభివర్ణించారు.