ప్ర‌జా సంక‌ల్ప యాత్ర @ 250వ రోజు

విశాఖ: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ‌తేడాది నవంబ‌ర్ 6వ తేదీన ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఇవాళ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 250వ రోజుకు చేరింది. విశాఖపట్నం జిల్లాలో జననేత 250వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం అనకాపల్లి నియోజకవర్గంలోని తుమ్మలపాల శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి మర్టురు క్రాస్‌, బవులవాడ క్రాస్‌, త్రిముర్తుల నగర్‌  మీదుగా ధర్జీనగర్‌ వరకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర సాగనుంది.

నవరత్నాలే అస్త్రాలుగా..
విలువలు...విశ్వసనీయతేæ ఆయుధంగా..ప్రజాభిమానం..ఆత్మీయతే జవసత్వాలుగా నవశకానికి నవరత్నాలే అస్త్రాలుగా సాగుతోంది ప్రజాసంకల్పయాత్ర. రేపటి ఉషోదయం కోసం.. నడుంబిగించిన అవిశ్రాంత యోథుడి కర స్పర్శ కోసం కదలి వచ్చారు. బాధలు చెప్పుకుని బాసటగా నిలవమని కోరేందుకు బారులు తీరారు. పేదల కష్టాలు..కన్నీళ్లు చూసి చలిస్తున్న జననేత రానున్నది రాజన్న రాజ్యం.. మీకిస్తాను బంగారు భవిష్యత్తు అంటూ భరోసా నిస్తూ ముందుకు సాగారు.‘నారా’ కాసుర పాలన అంతానికి సమరశంఖం పూరిస్తూ రాజన్న రాజ్యమే ధ్యేయంగా ముందుకు కదులుతున్న ప్రజాసంకల్పయాత్రకు జనం జేజేలు పలుకుతున్నారు.  వైయ‌స్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top