ఆయన్ను ఈస్థితిలో చూస్తే బాధేస్తోంది..!

గుంటూరుః
నిద్రాహారాలు మాని ఆరు రోజులుగా ప్రత్యేకహోదా కోసం నిరవధిక నిరాహారదీక్ష
చేస్తున్న తన భర్త వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యంపై భారతి ఆందోళన
చెందుతున్నారు. గంటగంటకు ఆరోగ్యం క్షీణిస్తుండడంపై  వైఎస్ జగన్ సతీమణి
 భారతి ఆందోళన వెలిబుచ్చారు. అదేవిధంగా జగన్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు
బాధ్యతారహితంగా మాట్లాడడాన్ని తప్పుబట్టారు.  జగన్ ను ఈ పరిస్థితుల్లో
చూస్తే బాధగా ఉందని భారతి ఆవేదన వ్యక్తం చేశారు.

దీక్షా
ప్రాంగణం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. 'షుగర్ లెవెల్ కూడా 61కి
వచ్చేసింది. అది కనీసం 80 పైన ఉంటే మంచిదని చెబుతున్నారు. మంత్రులు వాళ్లేం
చేస్తారో అది మాట్లాడితే మంచిది గానీ, పక్కన వాళ్లను తప్పుపడితే ఎలా?
వైఎస్ జగన్ ఆరు రోజుల నుంచి ఏమీ తినడం లేదు. చాలా బాధగా ఉంది' అని వైఎస్
భారతి వాపోయారు.
Back to Top