హైదరాబాద్, 6 సెప్టెంబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చేపట్టిన 'ఫీజు దీక్ష'కు తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం 100 మంది బీసీ నేతలు దీక్షాశిబిరాన్ని సందర్శించి ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతామని జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశంగౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.విజయమ్మ దీక్షకు మద్దతు తెలిపిన జీవీఎస్<br/>విజయమ్మ దీక్షకు మద్దతు తెలిపిన జీవీఎస్'ఫీజు దీక్ష'కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు గిరిజన విద్యార్థి సమాఖ్య (జీవీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు వి.శంకర్నాయక్ తెలిపారు.