మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
రంగా సేవలను స్మరించుకుందాం
26 Dec 2017 11:52 AM
విజయవాడ వైయస్ఆర్సీపీ కార్యాలయంలో రంగా వర్ధంతి
అనంతపురం: కాపు నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా సేవలను స్మరించుకుందామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రంగా వర్ధంతి కార్యక్రమం అనంతపురంలో జరిగింది. జిల్లాలో 44వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంటలో జరిగిన వంగవీటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.
మా స్ఫూర్తి, ఆదర్శం రంగా: రాధా
విజయవాడ నగరంలో వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. నగరంలోని బందరు రోడ్డులో గల రాఘవయ్య పార్కులోని రంగా విగ్రహానికి పూల మాలలు వేసి ఆయన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి వంగవీటి రాధాకృష్ణ ఘనంగా నివాళులర్పించారు. ఆయన చనిపోయి ఇన్ని ఏళ్లు అయినా వాడవాడలా అభిమానులు ఆయన వర్థంతిని జరుపుతున్నారని అన్నారు. రంగా ఒక కులం.. ఒక మతం.. ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదన్నారు. దేశవిధేశాలలో ఆయనకు అభిమానులున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో రంగా అభిమానులు ప్రతి విషయంలో కలిసికట్టుగా ఉండాలలని ఉద్బోధించారు.
పార్టీ కార్యాలయంలో..
విజయవాడ నగరంలోని వైయస్ఆర్సిపి రాష్ట్ర కార్యాలయంలో వంగవీటి వర్ధంతి సభ జరిగింది. పార్టీ నేతలు కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆసిఫ్, సోమినాయుడు, తోట శ్రీనివాస్, అడపా శేషు, పలువురు కార్పొరేటర్లు రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల గుండెల్లో రంగా చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. రంగా ఆశయాలను ఆయన అభిమానులు ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు. అలాగే స్థానిక రాఘవయ్య పార్కు వద్ద రంగా విగ్రహానికి ఆయన కుమారుడు రాధా నివాళులు అర్పించారు. ఆయనతోపాటు సినీ నటుడు జివి నాయుడు కూడా ఉన్నారు. అనంతరం రంగాపై మెగా సీరియల్ తీస్తున్నట్టు జీవీ ప్రకటించి పోస్టర్ ఆవిష్కరించారు.
చిలకలూరిపేటలో..
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రంగా వర్ధంతి సందర్భంగా విశ్వనాథ్ ధియేటర్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు.