రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
చెరకు రైతులకు షర్మిలకు భరోసా
10 Jul 2013 1:18 PM
కొత్త భీమసింగి (విజయనగరం జిల్లా),
10 జూలై 2013: జగనన్న నేతృత్వంలో త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చెరకు రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. సహకార చక్కెర కర్మాగారానికి 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఊపిరి పోశారని శ్రీమతి షర్మిల గుర్తు చేశారు. అయితే ఆ మహానేత మరణం తర్వాత చక్కెర కర్మాగారం నష్టాల్లోకి వెళ్లిందని ఆమె విచారం వ్యక్తం చేశారు.
ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వం తీరును, దానికి రక్షణ కవచంలా నిలిచి కాపాడుతున్న చంద్రబాబు వైఖరిని ఎండగడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన సోదరి చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర 205వ రోజు బుధవారం నాడు ఆమెను జిల్లా గజపతినగరం నియోజకవర్గంలోని కొత్త భీమసింగి వద్ద చెరుకు రైతులు కలుసుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల చెరకు రైతుల సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. చెరకు మద్దతు ధర పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రైతులు ఆమెకు విజ్ఞప్తి చేశారు.