రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
'తూర్పు' తుపాను ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్
26 Nov 2013 11:48 AM
హైదరాబాద్, 26 నవంబర్ 2013:
హెలెన్ తుపాను బీభత్సానికి గురై విలవిలలాడుతున్న అన్నదాతలను పరామర్శించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా వాసులకు ఏ చిన్న కష్టం వచ్చినా ‘నేనున్నా’నంటూ అందరికంటే ముందుగా స్పందించే ఆయన పుట్టెడు కష్టాల్లో ఉన్న బాధితులకు అండగా నిలిచి, ధైర్యం చెప్పేందుకు ముందు వచ్చారు. ఉదయం పది గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో రాజమండ్రి సమీపంలోని మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రావులపాలెం మీదుగా కోనసీమలో పర్యటనకు వెళ్ళారు.
ఈ రోజు శ్రీ జగన్ కొత్తపేట, ముమ్మడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల మీదుగా ఆయన పర్యటన కొనసాతుంది. అవిడి, చెయ్యేరు, కాట్రేనికోన, ఎన్.కొత్తపల్లి, అంబాజిపేట, మాచవరం, రాజోలు, శివకోడు ప్రాంతాల్లో శ్రీ జగన్ పర్యటించి హెలెన్ తుపానులో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. తుపాను బాధిత ప్రాంతాల్లోని రైతులు, మత్స్యకారులతో ఆయన మాట్లాడతారు.