చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రాష్ట్రపతితో నేడు జగన్ బృందం సమావేశం
04 Nov 2013 10:31 AM
హైదరాబాద్, 4 నవంబర్ 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుంటుంది. ఈ మేరకు రాత్రి 9 గంటల తరువాత రాష్ట్రపతితో సమావేశం అయ్యేందుకు అనుమతి లభించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్లో కలవడానికి తమకు సమయం కేటాయించాలని శ్రీ జగన్ ఇటీవల లేఖ ద్వారా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాత్రి రాజ్భవన్లో బస చేయనున్న రాష్ట్రపతిని శ్రీ జగన్ బృందం కలుసుకునేందుకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి అనుమతి లభించింది.