రాష్ట్రపతితో నేడు జగన్‌ బృందం సమావేశం

హైదరాబాద్, 4 నవంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని క‌లుసుకుంటుంది. ఈ మేరకు రాత్రి 9  గంటల తరువాత రాష్ట్రపతితో సమావేశం అయ్యేందుకు అనుమతి లభించింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం హైదరాబాద్‌ వస్తున్నారు. హైదరాబాద్‌లో కలవడానికి తమకు సమయం కేటాయించాలని శ్రీ జగన్ ఇటీవల లేఖ ద్వారా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాత్రి రా‌జ్‌భవన్‌లో బస చేయనున్న రాష్ట్రపతిని శ్రీ జగన్‌ బృందం కలుసుకునేందుకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి అనుమతి లభించింది.

Back to Top