బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఏపీ పురోభివృద్ధికి తోడ్పాటివ్వండి
20 May 2014 2:24 PM
న్యూఢిల్లీ:
విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి కాబోయే ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం అడ్డగోలుగా విభజించి ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం అయినా ఆ అన్యాయాలను సరిదిద్ది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మించే రాజధానికి కేంద్ర సహకారం అవసరమన్నారు.
‘ఆర్థిక ఇబ్బందుల కారణంగా మా రాష్ట్రం తనకుతానుగా అన్ని అవసరాలను తీర్చుకోలేదు. కొత్త రాజధానిని పునాదుల నుంచి నిర్మించుకోవాల్సి ఉన్నందున దానికి అవసరమైన నిధులను కేటాయించండి’ అని మోడీని శ్రీ జగన్మోహన్రెడ్డి కోరారు. ఇదే సమయంలో రాష్ట్ర విభజనపై ప్రకటన చేసే సమయంలో అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ సీమాంధ్రకు ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీ, వివిధ సంస్థలు, విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై హామీ ఇచ్చారని, అవి అన్నీ తక్షణం అమలయ్యేలా చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రధాన మంత్రి కార్యాలయంలో ప్రత్యేక అధికారి (ఓఎస్డీ)ని నియమించాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు తెలంగాణ ప్రాంతానికి ఆయువుపట్టు అయిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని మోడీకి శ్రీ జగన్ విజ్ఞప్తి చేశారు.
సోమవారం ఉదయం ఢిల్లీ వచ్చిన శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని బృందం మధ్యాహ్నం నరేంద్ర మోడీని గుజరాత్ భవన్లో కలుసుకుంది. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన భేటీలో ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, ఎస్పీవై రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైయస్ అవినాశ్రెడ్డి, పి. మిథున్రెడ్డి, బుట్టా రేణుక, కొత్తపల్లి గీత, వరప్రసాద్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరి ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు పుష్పగుచ్ఛాన్ని అందించి ముందుగా మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.
నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశ అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తుందని ఆకాంక్షిస్తున్నామని శ్రీ జగన్ తెలిపారు. ఇదే సమయంలో పార్టీ ఎంపీలను ఒక్కొక్కరిగా మోడీకి పరిచయం చేశారు. అనంతరం రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లోని అస్పష్టతను తొలగించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరుతూ నాలుగు పేజీల విజ్ఞాపన పత్రం అందజేశారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి సంపూర్ణ తోడ్పాటు అందించాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో గత ప్రభుత్వం అసంబద్ధ ప్రకటనలు చేసిందని, దీనిపై మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే నూతన కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉందని దృష్టికి తెచ్చారు.
రైతులను ఆదుకోండి :
రాష్ట్రంలోని రైతల పరిస్థితి దైన్యంగా ఉందని మోడీ దృష్టికి శ్రీ వైయస్ జగన్ తీసుకువచ్చారు. వరుసగా వచ్చిన తుపాన్లు, అకాల వర్షాల కారణంగా రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, పంటలు, ఉద్యానవనం, కోళ్ల పరిశ్రమ, చేపల పరిశ్రమ దారుణంగా దెబ్బతిన్నాయని వివరించారు. అయినప్పటికీ గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని, వారికి ఆసరాగా నిలవలేదని తెలిపారు. పెరిగిన ఎరువుల ధరలు, వ్యవసాయ ఖర్చుల కారణంగా రైతులు డీలా పడిపోయారని, వారిని ఆదుకోవాలని ఎన్నిమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం అయినా వారికి అండగా నిలిచి, రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు.
రాజ్నాథ్తో జగన్ బృందం భేటీ :
బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్తో సోమవారం సాయంత్రం శ్రీ వైయస్ జగన్ భేటీ అయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బీజేపీకి అద్భుత విజయాన్ని సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 20 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎంపీలందరినీ రాజ్నాథ్కు శ్రీ జగన్ పరిచయం చేశారు. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ సహకారం కోరారు. ఈ భేటీ అనంతరం శ్రీ వైయస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ‘ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే. ఇతర అంశాలపై చర్చించలేదు’ అని తెలిపారు.
సానుకూలంగా స్పందించారు: జగన్
మోడీతో భేటీ అనంతరం శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో రాష్ట్ర పురోభివృద్ధికి సంపూర్ణ సహకారాలు అందించాలని మోడీని కోరినట్లు తెలిపారు. ఇదే సమయంలో ‘రాష్ట్రాన్ని ఎంత దారుణంగా విభజించారంటే ప్రధాని పదవి నుంచి వైదొలగనున్న ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ పార్లమెంట్లో కేవలం ఓ లేఖ మాత్రమే చదివి వినిపించారు. ఆ లేఖలోని అంశాలు విభజన బిల్లులోకి రాలేదు. హైదరాబాద్ను తీసేసిన తర్వాత కొత్త రాజధానికి ఎన్ని నిధులు ఇస్తారన్నదీ పేర్కొనలేదు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని చెప్పినప్పటికీ ప్రత్యేక హోదా ఏమిటీ?, వేటికి ఇది వర్తిస్తుంది చెప్పకుండా దారుణంగా విభజన చేశారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా చేసిన విభజన వల్ల జరిగిన అన్యాయాలను సరిచేస్తూ ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసే కొన్ని మార్పులు కోరుతూ ఆయనకు వినతిపత్రం సమర్పించాం. మీ సహాయం కావాలని కోరాం. దానిపై ఆయన సానుకూలంగా స్పందించారు. కొత్త రాష్ట్రానికి ఏది మంచో అది చేస్తామని చెప్పారు’ అని తెలిపారు.
అంశాలవారీ మద్దతిస్తాం :
ఎన్డీఏకు మద్దతుపై జాతీయ చానళ్ల ప్రతినిధులు ప్రశ్నించగా ‘ఈ రోజు మోడీకి మా మద్దతు అవసరం లేదు. వారికి సొంతంగానే 283 పార్లమెంట్ స్థానాలున్నాయి. వారికి ఎవరి సహాయం అవసరం లేదు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఈ దేశ ప్రధాని సహాయం కావాలి. ఆయన సంపూర్ణ సహకారాలు మాకు కావాలి. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్నామని మేము ఏనాడూ చెప్పలేదు. వారికి అంశాలవారీగా మద్దతు కచ్చితంగా ఇస్తాం. రాష్ట్ర ప్రయోజనాలు మాకు చాలా ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలపై మోడీ సైతం సానుకూలంగా ఉంటారనే భావిస్తున్నాం’ అని చెప్పారు.