ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
సుపరిపాలన అందించే నాయకుడినే ఎన్నుకోండి
27 Apr 2014 3:03 PM
విశాఖపట్నం:
‘ఎన్నికలు దగ్గరపడ్డాయి. సుపరిపాలన అందించే నాయకుడినే ఎంచుకోవాలి. అలా అయితేనే సంక్షేమ ఫలితాలు గడపగడపకు అందుతాయి. జగన్బాబు తన తండ్రి రాజశేఖరరెడ్డిలాగే దీక్ష, పట్టుదల, తెగువ ఉన్న నాయకుడు. జగన్ సీఎం అయితే అయిదు సంతకాలతో రాష్ట్ర చరిత్రను తిరగరాస్తాడు. వైయస్ఆర్ సంక్షేమ పథకాలన్నీ తిరిగి గాడినపెట్టి రాష్ట్రంలో సమస్యలు పరిష్కరిస్తాడు' అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ లోక్సభా స్థానంలో పార్టీ అభ్యర్థి శ్రీమతి వైయస్ విజయమ్మ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీమతి విజయమ్మ శనివారం విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం, యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం, చోడవరం నియోజకవర్గం వడ్డాది, మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్షో నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.
'ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి కాబట్టే ఆనాడు జగన్బాబును జైలుపాలు చేశారు. ఎన్ని కష్టాలుపడనా నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తాడు. అందుకే ఈ ఎన్నికల్లో జగన్కు పట్టం కట్టి తిరిగి రాజన్న రాజ్యం తెచ్చుకుందాం. వైయస్ఆర్ స్వర్ణయుగం జగన్తోనే సాధ్యం’ అని శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు.
పోలీసుల ఓవర్ యాక్షన్ :
దేవరాపల్లి సభలో ప్రసంగించడానికి శ్రీమతి విజయమ్మ సిద్ధమవుతుండగా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. గ్రామీణ ప్రాంతంలో 8 గంటల వరకే ఎన్నికల యాత్రకు అనుమతి ఉందంటూ... పర్యటన ముగించాలని హెచ్చరించారు. ఇంకా సమయం ఉన్నప్పటికీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై శ్రీమతి విజయమ్మ ఆగ్రహవ వ్యక్తం చేశారు. ప్రసంగించడానికి అనుమతించకపోతే స్టేషన్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. దీనితో దిగివచ్చిన పోలీసులు శ్రీమతి విజయమ్మ ఒక్కరే ప్రసంగించాలని షరతు విధించారు. వేలాదిగా హాజరైన ప్రజలను ఉద్దేశించి శ్రీమతి విజయమ్మ ఉత్సాహపూరితంగా ప్రసంగించారు.