ఓటు పరీక్షలో డిస్టింక్షన్‌ ఇవ్వండి

విశాఖపట్నం:

'మనసున్న మారాజు మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోతే ఆ బాధ తట్టుకోలేక గుండె పగిలి రాష్ట్రంలో కొన్ని వందల మంది ప్రాణాలు వదిలేశారు.‌ వైయస్ఆర్ చనిపోయి అయిదేళ్లవుతున్నా మీ అందరి గుండెల్లో ఆయన బతికే ఉన్నారు. ఆయన ‌మరణించిన తర్వాత మా ప్రతి కష్టంలోనూ మీరంతా మమ్మల్ని అక్కున చేర్చుకున్నారు. మా ప్రతి పోరాటంలోనూ అండగా నిలిచారు. జగనన్నపై కక్షగట్టిన సోనియాగాంధీ టీడీపీ నేతలతో కలిసి, కుట్రపన్ని జైలు పాలుచేస్తే తెలుగు ప్రజలు ‌జగనన్న కోసం పరితపించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు ఎదురైనా మీ అండతో ధైర్యంగా ముందడుగు వేయగలిగాం. అందుకు వైయస్ కుటుంబం మీ అందరికీ రుణపడి ఉంది. ఆ రుణం తీర్చుకోవడానికి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి. జగనన్న ముఖ్యమంత్రి అయితే ‌వైయస్‌ఆర్ సంక్షేమ పథకాలన్నింటినీ సమర్థంగా అమలుచేస్తారు’ అని వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చెప్పారు. ఎన్నికల ప్రచారం‌ వైయస్ఆర్ జనభేరి చివరి రోజు సోమవారం శ్రీమతి షర్మిల, పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీమతి విజయమ్మతో కలసి విశాఖలో ప్రచారం నిర్వహించారు.

‘మీరంతా జగనన్న వదిలిన బాణాలు. మనం పరీక్ష రాసే సమయం వచ్చింది. 75 శాతం ఓటింగ్ వై‌యస్ఆర్‌సీపీకి పడేలా ఉండాలి. డిస్టింక్షన్లో పాసవ్వాలి. విజయం సాధించి వైయస్ఆర్‌కి కానుకగా ఇవ్వాలి’ అని ప్రజలకు శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. ‘లెక్కలేనంత తిక్క ఉందని పవన్ కల్యా‌ణ్ స్వయంగా చెప్పుకున్నాడు. అలాంటి మనిషి గురించి ప్రత్యేకంగా నేనేం మాట్లాడతాను. అయిపోయింది.. ఈ రోజుతో పవ‌న్ కల్యా‌ణ్ చాప్ట‌ర్ క్లోజ్. బాలకృష్ణా.. ఆయనొక చచ్చిన పాము. వదిలేద్దాంలే.. పాపం పోనీ..!’అంటూ చురకలు వేశారు.

చంద్రబాబు ఒక పెద్ద సైకో :
'చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటి తన పాలననే తిరిగి తెస్తానని చెప్పే ధైర్యం ఆయనకు ఉందా? రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలనే తాను కూడా చేస్తానంటూ ఆయన చెబుతున్నారు. వైయస్ఆర్ రుణ‌ మాఫీ చేస్తే తాను కూడా చేస్తానంటున్నారు. కానీ తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు రుణ మాఫీ చేయాలని చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు రాలేదు? పోనీ రుణాలపై వడ్డీ అయినా మాఫీ చేశారా? నిజానికి బాబు దృష్టిలో రైతులు పురుగులకన్నా హీనం. సీఎంగా కూర్చుని వ్యవసాయం దండగ అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. తిన్నదరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అవమానించారు' అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.
'చంద్రబాబు నాయుడి తెలివి సామాన్యమైనది కాదు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచారు. ఆయన పార్టీని, అధికారాన్నీ లాక్కుని, ఎన్టీఆర్‌నే పార్టీ నుంచి గెంటేశారు. ఎన్టీఆర్ బతికున్నపుడు చెప్పులు వేయించిన చంద్రబాబు ఇపుడు ఓట్ల‌ కోసం ఆయన ఫొటోకు దండలు వేస్తున్నారు' అని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు.

'చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు అడిగితే.. మెస్ చార్జీలు కూడా ఇవ్వలేదు. జీతాలు పెంచమని అంగ‌న్‌వాడీలు అడిగితే.. మహిళలని కూడా చూడకుండా గుర్రాలతో తొక్కించారు. ఆయన పెద్ద సైకో కాక మరేంటి?' అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు.

'ప్రభుత్వ ‌ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునేది పేదలే. అలాంటి వారికి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో ఉచిత వైద్యం అందించకపోగా.. వారి నుంచే యూజర్ చార్జీలు వసూలు చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచించారు. ఓ మహిళ తన భర్త చనిపోయాడు.. పెన్షన్ ఇప్పించండి బాబూ అని అడిగితే.. మీ ఊళ్లో ఎవరైనా చనిపోతే ఇస్తానన్నారు. ఒకరికి పెన్ష‌న్ రావాలంటే మరొకరు చనిపోవాలని కోరుకునేవాడు‌ పెద్ద సైకో కాక మరేంటి?' అని నిలదీశారు.

'వ్యవసాయానికి సబ్సిడీ దండగన్న చంద్రబాబు.. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తారంటే నమ్మగలమా? తన పాలనలో ఎనిమిదిసార్లు కరెంట్ చార్జీలు పెంచిన చంద్రబాబు ఇపుడు ఉచిత విద్యు‌త్ ఇవ్వగల‌రా? లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను పప్పుబెల్లాల్లా తన బినామీలకు కట్టబెట్టిన ఆయన కొత్తగా పరిశ్రమలు తెస్తాడా? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడం, డీఏ, పీఆ‌ర్‌సీ పెంపు దండగన్నచంద్రబాబు ఇపుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా?' అన్నారు. ‌'తన నియోజకవర్గం కుప్పంను మున్సిపాలిటీగా చేసుకోలేని చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్, మలేసియా, జపాన్ చేసేస్తాడంటే నమ్మగలమా? ఈయన చెప్పే సొల్లు వినడానికి మనమేమైనా చెవుల్లో పువ్వులు పెట్టుకున్నామా?' అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

జగనన్నతోనే రాజన్న రాజ్యం సాధ్యం :
'మహానేత రాజశేఖరరెడ్డి పాలనలో మన రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రైతులకు నీళ్లిచ్చారు. 7 గంటలు కరెంటు ఇచ్చారు. మద్దతు ధర, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించారు. రైతులకు రుణ మాఫీ చేశారు. చంద్రబాబు రైతులకు, మహిళలకు రూపాయి వడ్డీకి రుణాలిస్తే వైయస్ఆర్ పావలా వడ్డీకే రుణాలిచ్చారు. మహిళలు వై‌యస్ఆర్ పుణ్యాన ఆర్థికంగా స్థిరపడగలిగారు‌' అని శ్రీమతి షర్మిల తెలిపారు. 'చంద్రబాబు తన పాలనలో 16 లక్షల పింఛన్లు ఇస్తే వైయస్ఆర్ 71 లక్షల పింఛన్లు ఇచ్చారు. అయిదేళ్లలో కేంద్రప్రభుత్వం దేశం మొత్తం‌ మీద పేదల కోసం 47 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తే వైయస్ఆర్ మన రాష్ట్రంలో 48 లక్షల పక్కా ఇళ్లు కట్టి చూపించారు‌' అని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు.

'కిలో బియ్యాన్ని చంద్రబాబు రూ.5.25కు పెంచేస్తే... మహానేత వైయస్ఆర్ మార్కెట్లో రూ.25 పలికే కేజీ బియ్యాన్ని పేదలకు రూ.2కే అందించారు. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి పేదలకు ఖరీదైన వైద్యం చేయించారు. ఫో‌న్ చేసిన 20 నిమిషాలకు 108 వచ్చేది.‌ వైయస్ఆర్ తన ఐదేళ్ల పాలనలో ఒక్క పన్ను, ఒక్క చార్జీ పెంచలేదు. విత్తనాలు, ఆర్టీసీ చార్జీలు, ధరలు పెంచలేదు. గ్యా‌స్ ధర వై‌యస్ఆర్ సీఎం కాక‌ ముందు ఎంత ఉందో ఆయన చనిపోయేవరకు అదే ధర ఉంది. చంద్రబాబు ఎనిమిదేళ్లలో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచారు' అని శ్రీమతి షర్మిల వెల్లడించారు.

మహానేత వైయస్ఆర్ మరణించాక సీ‌ల్డు కవర్‌లో ఊడిపడిన కిరణ్‌కుమార్‌రెడ్డి వైయస్ఆర్ ప్రతి పథకాని‌కీ తూట్లు పొడిచారు. ఐదుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు. రూ.32 వేల కోట్లు విద్యుత్ చార్జీలు, స‌ర్‌చార్జీలు అంటూ పెంచేశారు. ఇన్ని అరాచకాలు జరిగితే ఐదేళ్లలో చంద్రబాబు ఏ ఒక్కసారైనా ప్రధాన ప్రతిపక్షం హోదాలో నిలదీశారా? తన అవినీతి ఆరోపణల నుంచి బయటపడడం కోసం ప్రతిపక్షం పాలకపక్షంతో కుమ్మక్కైంది. ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని దించాలని ప్రయత్నిస్తే బాబు కాంగ్రెస్‌కు రక్షణ కవచంగా నిలిచారు. సోనియా తన కొడుకును ప్రధాని చేయాలన్న ఆశతో రాష్ట్రాన్ని విభజిస్తే దానికి సహకరించింది చంద్రబాబే' అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల కోసం ఈ ఐదేళ్లలో పోరాటం చేసింది ఒక్క జగనన్న మాత్రమే. వారం పాటు మెతుకు ముట్టకుండా రైతులు, చేనేతల కోసం, పెంచిన చార్జీలు తగ్గించడం కోసం నిరాహార దీక్షలు చేసింది జగనన్న ఒక్కరే. మన రాష్ట్రాన్ని ముక్కలు చే యవద్దని నిరాహార దీక్షలు చేసింది జగనన్న మాత్రమే. ఫ్యాను గుర్తుపై ఓటేసి వైయస్ఆర్‌సీపీని గెలిపించండి. జగనన్న మీ సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తాడు' అని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.

వైయస్ఆర్ బతికున్నంత వరకు రాజకీయాల్లో కనీస జోక్యం‌ లేని విజయమ్మ, తమ కుటుంబాన్ని నమ్ముకుని వెంట నిలిచిన వారి విజయం కోసమే తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి, విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి విజయమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. కడప ఉప ఎన్నికలో పార్టీ అధ్యక్షుడు జగనన్నకు వచ్చిన 5.40 లక్షల ఓట్ల మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో పట్టంకట్టాలి' అని శ్రీమతి షర్మిల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Back to Top