రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
'సహకార ఎన్నికల్లో వైయస్ రుణం తీర్చుకోవాలి'
09 Jan 2013 11:50 AM
పీలేరు (చిత్తూరు జిల్లా):
సహకార సంఘాలకు జరిగే ఎన్నికల్లో రైతులందరూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ఆ పార్టీ యువనేత పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎవరి ఒత్తిళ్లకూ భయపడకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో భాగస్వాములు కావాలని కోరారు. మహానేత తన హయాంలో రైతుల ఇబ్బందులను గుర్తించి రుణమాఫీ, ఏడు గంటల ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాల వంటి పలు పథకాలు ప్రవేశపెట్టి రైతులకు ఎంతో మేలు చేశారన్నారు. ఏదో ఒక రూపంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం లబ్ధి పొందిందన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి సహకార ఎన్నికల్లో రైతులందరూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహనరెడ్డి పక్షాన నిలబడి అందరినీ గెలిపించాలని కోరారు. జిల్లాలోని రైతులందరి సహకారంతో అన్ని మండలాల్లో సహకార పోరులో ఘనవిజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు.