అచ్చం పెద్దాయ‌న‌లా ఉన్నారు


- రాజ‌న్న బిడ్డ‌ను చూసి మురిసిపోతున్న క‌ర్నూలు ప్ర‌జ‌లు
- అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌రథం
- వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కావాల‌ని నిన‌దిస్తున్న ప్ర‌తిఒక్క‌రు 
- పేద‌ల బ‌తుకులు మారుస్తా- వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా 
కర్నూలు:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని క‌ర్నూలు ప్ర‌జ‌లు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంకల్ప యాత్ర‌కు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఎక్క‌డికి వెళ్లినా అచ్చం రాజ‌న్న‌లా ఉన్నావ‌ని మురిసిపోతున్నారు. ‘నువ్వు ముఖ్యమంత్రి కావాలి..మా బతుకులు మారాలి జగనన్నా’ అంటూ ప్ర‌తి ఒక్క‌రు వైయ‌స్‌ జగన్‌కు విన్నవిస్తున్నారు. మిమ్మల్ని చూస్తే మీ నాయన వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డిని చూసినట్లే ఉందని సంతోష‌ప‌డుతున్నారు.  మీరు, మీ నాన్నలానే మా పేదల జీవితాల్లో మార్పు తెస్తారనే నమ్మకం మాకుంది. అందుకే నువ్వు రావాలి అన్నా’ అని మహిళా కూలీలు వైయ‌స్‌ జగన్‌ను ప్రేమతో ఆశీర్వదించారు. అనంతరం వైయ‌స్‌ జగన్‌ మాట్లాడుతూ ‘త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది. గ్రామాల్లో పేదరిక నిర్మూలనకు పథకాల అమలుకు అందరం కృషి చేద్దాం.. మీరంతా దేవున్ని ప్రార్థించండి. కూలీల బతుకులకు ఒక భరోసా ఇవ్వడానికి, నేరుగా వారి కష్టాలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నా’ అని వైయ‌స్ జగన్‌ తెలిపారు.

అడుగులో అడుగేస్తూ..
ఈ నెల 6వ తేదీన ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ఈ నెల 14వ తేదీ క‌ర్నూలు జిల్లాలోకి ప్ర‌వేశించింది. వైయ‌స్ జ‌గ‌న్ వెంట వేలాది మంది అడుగులో అడుగు వేస్తూ పాద‌యాత్ర‌గా ముందుకు సాగుతున్నారు. జ‌న‌నేత వ‌స్తుంటే ప్ర‌తి ఊర్లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. మూడు రోజుల పాటు ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన వైయ‌స్ జ‌గ‌న్ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లిశారు. నిన్న‌టి నుంచి బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లుపెట్టారు. 

ఆత్మీయ స్వాగ‌తం:  
వైయ‌స్ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గంలో ఆత్మీయ స్వాగ‌తం ల‌భించింది. పార్టీ నాయ‌కులు, ప్ర‌జ‌లు జ‌న‌నేత‌కు  ఘనస్వాగతం పలికారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్ జగన్‌ శనివారం మధ్యాహ్నం కోవెలకుంట్ల మండలం కంపమల్లమెట్ట వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

జ‌న‌నేత‌కు సన్మానం   
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారం రాత్రి కోవెలకుంట్ల పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ముస్లింలు దిల్క్‌బాషా, అక్బర్‌బాషా, ఖాలీద్, బాబు, అన్సర్, మహబూబ్‌బాషా తదితరులు జగన్‌కు కంకణం కట్టి శాలువాతో సత్కరించారు.  
Back to Top