వెలుగోడు రిజర్వాయర్‌ను పరిశీలించిన వైయస్‌ఆర్‌ సీపీ నేతలు

కర్నూలు: బ్రహ్మసాగర్‌ రిజర్వాయర్‌కు 13 టీఎంసీల నీరు ఇవ్వాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వెలుగోడు రిజర్వాయర్‌ను ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, పార్టీ నేత బుడ్డా శేషారెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వెలుగోడు రిజర్వాయర్‌కు ప్రభుత్వం మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందించాలన్నారు. 

Back to Top