వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
నెట్టెంపాడులో మహానేత విగ్రహానికి షర్మిల అభిషేకం
29 Nov 2012 2:04 PM
నెట్టెంపాడు:
నెట్టెంపాడు ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాంగణంలో ఉన్న దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఆయన తనయ శ్రీమతి షర్మిల కృష్ణా జలాలతో అభిషేకం చేశారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పవర్ హౌస్ను దివంగత మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల గురువారం సందర్శించారు. ఇంజినీర్లతో మాట్లాడి హౌస్ వివరాలను తెలుసుకున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు నిర్వసితులను ఆమె కలుసుకున్నారు. వారి వెతలను తెలుసున్నారు. ఆయకట్లు రైతులోనూ మాట్లాడారు. నిర్వాసితులకు న్యాయం చేస్తామనీ, వారికి అండగా నిలబడతామనీ శ్రీమతి షర్మిల వారికి హామీ ఇచ్చారు. శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం గురువారానికి 43వ రోజుకు చేరింది. నెట్టెంపాడు నుంచి ఆమె తన పాదయాత్రను మొదలుపెట్టారు. ఎత్తిపోతల పథకాన్ని చూసి ఆమె ఉద్వేగానికి గురయ్యారు. కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలాయి.