ఆ జీవోను రద్దు చేయాలి

విశాఖపట్నం: మున్సిపల్ కార్మికులు విశాఖలో ఆందోళనకు దిగారు. కార్మికులకు కష్ట దాయకమైన జీవో 279 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలు కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ తో పాటు పలుకార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జీవో ప్రతులను దగ్ధం చేశారు.

Back to Top