అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
మోడీ, చంద్రబాబుల దొంగ నాటకాలు
30 Jul 2016 4:17 PM
తిరుపతిః నరేంద్రమోడీ, చంద్రబాబుపై వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి నిప్పులు చెరిగారు. తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... మోడీ, చంద్రబాబులు తిరుపతిలో శ్రీవారి పాదాల సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కారని ఆరోపించారు. 5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ, టీడీపీ కలిపి మంటగలిపాయని మండిపడ్డారు.
మోడీ, చంద్రబాబులు దొంగనాటకాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఢిల్లీ వెళ్లడం సహా అనేక పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేకహోదా సాధనే లక్ష్యంగా వైయస్సార్సీపీ ఆగస్టు 2న తలపెట్టిన బంద్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.