మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల రాజకీయం
27 Jul 2013 4:00 PM
తిరుపతి, 27 జూలై 2013:
కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల రాజకీయం చేస్తున్నదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతిలో శనివారంనాడు ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని చెప్పకుండా గందరగోళంలో పడేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే ఎక్కువ సీట్లు వస్తాయనే ఆలోచనలో ఆ పార్టీ అధిష్ఠానం పెద్దలున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన వైఖరి వెల్లడించనందుకు నిరసనగానే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశామని ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ దాగుడుమూతల తీరు కారణంగానే ఇరు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.