<strong>మైలవరం (కృష్ణాజిల్లా),</strong> 13 ఏప్రిల్ 2013: మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ అధినే శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 119వ రోజు షెడ్యూల్ పూర్తయింది. శనివారం రాత్రి కృష్ణాజిల్లాలోని మైలవరం సమీపంలోని రాత్రి బసకు ఆమె చేరుకోవడంతో షెడ్యూల్ పూర్తయింది. అంతకు ముందు శ్రీమతి షర్మిల భట్టులవారిగూడెం చేరుకున్నారు. వైయస్ అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు.