వైయస్‌ జగన్‌కు ప్రజలు అండగా ఉన్నారు

విజయనగరంః వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం తర్వాత ఆయన ఎలా ఉన్నారో చూడాలని కాకినాడకు చెందిన వైయస్‌ఆర్‌సీపీ మహిళా నేతలు విజయనగరం జిల్లాకు వచ్చారు.కురుపాం నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్రలో జగన్‌ను కలిసి బాగోగులు తెలుసుకున్నారు.కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్‌ పసుపులేటి వెంకటలక్ష్మి,వైయస్‌ఆర్‌సీపీ నేతలు లీలావతి తదితరులు వైయస్‌ జగన్‌ అడుగుల్లో అడుగేశారు. వైయస్‌ జగన్‌ను చూస్తే వైయస్‌ఆర్‌ని చూసినట్లు ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నిన వైయస్‌ జగన్‌ను ఏమీచేయలేరని, జగన్‌కు భగవంతుని ఆశీర్వాదంతో పాటు ప్రజలందరూ అండగా ఉన్నామన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమన్నారు.
Back to Top