నీటి కేటాయింపుల్లో అన్యాయం: వాసిరెడ్డి పద్మ

విజయవాడ 28 ఆగస్టు 2013:

తెలుగుజాతి మధ్య అంతర్యుద్ధం కారణంగా కర్ణాటక, మహారాష్ట్రలకు మేలు  చేకూరుతుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనతో కర్ణాటక, మహారాష్ట్ర భారీగా లబ్ధి పొందుతాయని వివరించారు. మిగులు జలాల ఆధారంగా రూ. 30వేలకోట్లతో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నీ నీటికోసం ఎదురుచూస్తున్నాయన్నారు. మిగులు జలాల్లో 350 టీఎంసీలకు గాను 190 పెంచాలని కర్ణాటక, మహారాష్ట్రలు కోరుతున్నాయని చెప్పారు. నికర జలాల్లో రావాల్సిన 811 టీఎంసీల్లో 450మాత్రమే పొందుతున్నామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. మొత్తం 710 టీఎంసీలపై హక్కు ఉన్నప్పటికీ మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని గుర్తించలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ వాదులు ఈ విషయాన్ని గుర్తించాలనీ, ఎగువ రాష్ట్రాలనుంచి రావాల్సిన నీటి వాటాకోసం పోరాడాలనీ  వాసిరెడ్డి సూచించారు.

Back to Top