వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
సమైక్య శంఖారావానికి హైకోర్టు అనుమతి
16 Oct 2013 1:08 PM
హైదరాబాద్ 16 అక్టోబర్ 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు హైకోర్టు అనుమతించింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ‘సమైక్య శంఖారావం’ సభ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం రెండు గంటల నుంచి అయిదు గంటల వరకూ సభ నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. సమైక్య శంఖారావానికి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్పై హైకోర్టు పైమేరకు తీర్పునిచ్చింది. డీసీపీ కమలాసన్ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. తమ సభకు అనుమతి మంజూరు చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు బుధవారం ఉదయం అనుమతినిస్తూ తీర్పు ఇచ్చారు.