రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
హంద్రీనీవా అనగానే వైయస్సే గుర్తొస్తారు
09 Sep 2017 5:44 PM
వైయస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి
కదిరి: హంద్రీనీవా పేరు చెప్పగానే దాని గురించి అవగాహన ఉన్న వారికి ఎవరికైనా వెంటనే మహానేత వైయస్ రాజశేఖర్రెడ్డి గుర్తుకొస్తారని వైయస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు సీపీఐ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరుకున్న సందర్భంగా శనివారం ఆయన వారి శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ హయాంలో హంద్రీనీవా పనులు దాదాపు 80 శాతానికి పైగా యుద్ధప్రాతిపదికన జరిగాయన్నారు. ఆయన అకాల మరణం తర్వాత మిగిలిన పనులు పూర్తిగా ఆగిపోయాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేవలం కమీషన్లకు కక్కుర్తి పడుతూ హంద్రీనీవా పనుల అంచనాలను భారీగా పెంచేశారని విమర్శించారు. వైయస్ ఉన్నట్లయితే ఈపాటికి ఎప్పుడో హంద్రీనీవా నీటితో అన్ని చెరువులనూ నింపేవారన్నారు.