వైఎస్సార్సీపీలో చేరిన గుబ్బా చంద్రశేఖర్

హైదరాబాద్ః
మాజీ సర్వీస్ కమిషన్ సభ్యుడు గుబ్బా చంద్రశేఖర్ వైఎస్సార్సీపీలో చేరారు.
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లోటస్ పాండ్ లో
చంద్రశేఖర్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. దివంగత ముఖ్యమంత్రి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో గుబ్బా చంద్రశేఖర్ సెక్రటరీగా పనిచేశారు.
ఆతర్వాత సర్వీస్ కమిషన్ లో సభ్యుడిగా కొనసాగారు. 

వైఎస్సార్సీపీలో
చేరడం చాలా సంతోషంగా ఉందని గుబ్బా చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్రంలో
విలువలు, విశ్వసనీయత గల ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమేనని స్పష్టం
చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం కలిగిన నాయకుడు వైఎస్ జగన్ అని
చంద్రశేఖర్ కొనియాడారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడానికి తన వంతు
కృషిచేస్తానని గుబ్బా చంద్రశేఖర్ చెప్పారు. 
Back to Top