‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
'గ్రామీణ వైద్యులకు అండగా నిలుస్తాం'
19 Jan 2013 11:31 AM
కర్నూలు:
గ్రామీణ వైద్యులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. సమస్యల పరిష్కారానికి నగరంలో రిలే నిరాహార దీక్షలను చేపట్టిన గ్రామీణ వైద్యులు నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గ్రామీణ వైద్యులను కమ్యూనిటీ పారా మెడికల్సుగా గురిస్తూ.. వారికి శిక్షణ ఇచ్చేందుకు జీవో నంబర్ 429ని జారీ చేశారని గుర్తుం చేశారు. మహానేత మృతి చెందిన తరువాత గ్రామీణ వైద్యులను మరచిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ వైద్యుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు.