జమ్మలమడుగు: జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఎంపీ అవినాష్ రెడ్డి పరామర్శించారు. రైతుల నష్టపరిహారంపై నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం దారుణమని వైయస్ ఆవినాష్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహాంలో నియోజకవర్గ సమన్వయకర్త సుధీర్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడి, ఇన్సురెన్సూ ఇవ్వాలని డిమాండ్ చేశారు.<br/><br/>