మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
జగన్కు బలవంతంగా ఫ్లూయిడ్సు
31 Aug 2013 6:21 PM
హైదరాబాద్, 31 ఆగస్టు 2013:
సమన్యాయం చేయండి లేకపోతే.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి అంటూ గడచిన ఏడు రోజులుగా చేస్తున్న శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి దీక్షను వైద్యులు బలవంతంగా భగ్నం చేశారు. అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిన శ్రీ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం దృష్ట్యా బలవంతంగా నిమ్సు వైద్యులు ఫ్లూయిడ్సు ఎక్కించారు. దీనితో 151 గంటలుగా శ్రీ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష ముగిసింది.
శ్రీ జగన్మోహన్రెడ్డి ఆరోగ్య పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, ఫ్లూయిడ్సు ఎక్కించకపోతే ప్రాణానికే ప్రమాదమని నిమ్సు వైద్యుల బృందం ఇచ్చిన సమాచారానికి చంచల్గూడ జైలు అధికారులు స్పందించారు. సెక్షన్ 593 నిబంధన ప్రకారం బలవంతంగా అయినా ఐవి ఫ్లూయిడ్సు ఎక్కించాలని నిమ్సు డాక్టర్లకు అనుమతి ఇచ్చారు. దానితో ఆ విషయం చెప్పి డాక్టర్లు బలవంతంగా శ్రీ జగన్కు ఫ్లూయిడ్సు ఎక్కించారు. కాగా, శ్రీ జగన్ పూర్తిగా తేరుకోవడానికి మరికొన్ని రోజులపాటు చికిత్స అవసరమని నిమ్సు వైద్యులు వెల్లడించారు.
నిమ్సు డైరెక్టర్కు జైలు అధికారులు లేఖ పంపారు. జైలు నిబంధల ప్రకారం బలవంతంగా అయినా ఫ్లూయిడ్సు ఎక్కించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 590 నిబంధన ప్రకారం అత్యవసర చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము జైలు అధికారుల ఆదేశాలను పాటిస్తామని నిమ్సు వైద్యులు తెలిపారు. ప్లూయిడ్సు ఎక్కించిన తర్వాత కనీసం నాలుగు రోజులు చికిత్స అవసరమని వైద్యులు పేర్కొన్నారు.