రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతు ఆత్మహత్యలు
22 Mar 2017 11:58 AM
వెలగపూడి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ధ్వజమెత్తారు. రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సీడీ, ఇన్సూరెన్స్లు అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తయారైందని విమర్శించారు. రైతులను ఆత్మహత్యల బారినుంచి ఎలా కాపాడాలో ఆలోచించకుండా వ్యవసాయమే శుద్ధ దండగ అనే వైఖరిలో ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికల ముందు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కనీసం ఆ అప్పుల వడ్డీలు కూడా చెల్లించకపోతే రైతులు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వరు.. మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడనివ్వకుండా అడ్డుతగులుతున్నారని ధ్వజమెత్తారు.