బుధవారం నాటి మరో ప్రజాప్రస్థానం సాగేదిలా

గుంటూరు 13 మార్చి 2013:

దివంగత మహానేత డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ  వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర బుధవారం చిలకలూరిపేట, తాడికొండ నియోజకవర్గాల్లో సాగుతుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో బసచేసిన ప్రాంతం నుంచి బుధవారం ఉదయం బయలుదేరి కొండవీడు మీదుగా తాడికొండ నియోజకవర్గంలోని హెచ్. గణేశ్‌పేట, ఫిరంగిపురం మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం వేములూరుపాడు మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.

Back to Top