వైయ‌స్ఆర్‌సీపీతోనే బీసీల‌కు న్యాయం


తిరుప‌తి:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో సోమవారం బీసీ అధ్యయన కమిటీ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూమనతో పాటు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌, పెద్ద ఎత్తున బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. బీసీల‌పై నిజ‌మైన ప్రేమ చూపింది దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆయ‌న పేద‌ల కోసం ఓ అడుగు వేస్తే, వైయ‌స్ జగన్‌ రెండు అడుగులు వేయాలనే తపన ఉన్న వ్యక్తి అని తెలిపారు. బీసీ వర్గాల సమస్యలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి అధ్యయం చేస్తామన్నారు. బీసీ మేలు చేసే ప్రతి అడుగులో అడుగేస్తా అని హామీ ఇచ్చారు.
Back to Top