ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు వస్తారు.

మైనార్టీ సోదరులతో జననేత  ఆత్మీయ భేటీ
ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు వస్తారు. 
చంద్రబాబు మైనార్టీలకు రూ.2500 కోట్లు బడ్జెట్ లో పెడతామన్నారు?
రంగనాథన్ కమీషన్ సిఫార్సుల మేరకు.. ముస్లిం రిజర్వేషన్లు అని చంద్రబాబు అన్నారు. 
లక్ష వరకు వడ్డీలేని రుణాలు అన్నారు? అవి ఏమైంది?
 ప్రశ్నించిన వైయస్ జగన్




మైనార్టీ సంక్షేమం కోసం బడ్జెట్ లో 2500 కోట్లు పెడతామంటూ ఇచ్చిన హామీ ఏమైంది? లక్ష రూపాయల వరకూ వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు ఏమయ్యాయని సూటిగా ప్రభ్తుత్వాన్నినిలదీశారు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికలప్పుడు మాత్రమే  చంద్రబాబు నాయుడికి ముస్లింలు గుర్తుకు వస్తారని విమర్శించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మడిగుబ్బ క్రాస్ రోడ్స్ వద్ద మైనార్టీ సోదరులతో  ఆత్మీయ భేటీ నిర్వహించారు ప్రతిపక్ష నేత. ఈ సందర్భంగా ఆయన వారి సమస్యలను, అడిగి తెలుసుకున్నారు. మాట్లాడిన ప్రతి ఒక్కరూ దివంగత మహానేత వైయస్ ఆర్ పాలనలో జరిగిన మేలును తలచుకుంటూ, ప్రస్తుత ప్రభుత్వం మైనార్టీల పై చూపుతున్న వివక్షను ఎండగట్టారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే , మైనార్టీల సంక్షేమానికి చేపట్టాల్సిన కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి ఒక కమిటినీ నియమిస్తామని ప్రకటించారు.  దాదాపు గంటపాటు జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో జన నేత ప్రసంగంలోని ముఖ్యాంశాలు 

బాబు నాలుగేళ్లలో ప్రతి కులాన్ని, ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశారు. టీడీపీ 2014 ఎన్నికల ప్రణాళిక కోసం వెబ్ సైట్ లో చూస్తే కనిపించదు. అది కనిపిస్తే ప్రతి కులం, ప్రతి ఒక్కరూ కొడతారని భయం. అందుకే.. ఆయన టీడీపీ మేనిఫోస్టోను వెబ్ సైట్లో పెట్టుకోలేదు. ముస్లిం సోదరులకు ఎవరైనా మంచి చేశారంటే. గర్వంగా చెబుతాను. ప్రియతమ నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి మాత్రమే అని. నాన్నగారి హయాంలో పరిపాలన ఎలా ఉందో.. బాబు పాలన పరిపాలనకు తేడా చూస్తే.. మీకే తెలుస్తుంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 

నాన్నగారి హయాంలో పిల్లలు, డాక్టర్లు, ఇంజనీర్లు చదువుతామంటే భరోసా ఇచ్చారన్నారు. ఆ రోజుల్లో ఆరోగ్యం బాగోలేదంటే.. ఏ సమస్య వచ్చినా.. ఒక భరోసా ఉండేదన్నారు. కేవలం వారు చిరునవ్వుతో 108 నెంబర్ ఫోన్ చేస్తే చాలన్నారు. వాళ్ల ఇంటికి కుయ్... కుయ్ అంటూ అంబులెన్స్ వచ్చేదన్నారు. తద్వారా ఆరోగ్యంపై భరోసా నాన్నగారి హయాంలో ఉండేదన్నారు. ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదన్నారు. ఎంత పేదవాడైనా తన కుటుంబ సభ్యుల్ని బతికించుకోవటానికి తాహతు పడతారు. మంచి ఆసుపత్రికి తీసుకువెళ్లాలని తహతహలాడతారు. మంచి ఆసుపత్రులు అన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి. 60 ఏళ్లు రాజధానిగా ఉండబట్టే అక్కడ ఆసుపత్రులు ఉన్నాయి. చంద్రబాబు హయాంలో హైదరాబాద్ వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ ఇవ్వరట. నెట్ వర్క్ ఆసుపత్రులకు సంబంధించి 8, 9 నెలలు నుంచి బిల్లులు పెండింగ్ లో పెట్టారు. మరి, ఆసుపత్రికి వెళ్లే వైద్యం చేయించే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. 108 ఫోన్ చేస్తే.. డీజిల్ లేదనో, టైర్లు బాగోలేదనో సమాధానం వస్తోందన్నారు. అప్పుల పాలైతే తప్ప వైద్యం అందని పరిస్థితి ఉందన్నారు

ఈ రోజు  పేదరికంలో చాలా మంది ముస్లిం సోదరులు ఉన్నారు. ఒక్కసారి గుండె మీద చేయి వేసి ఆలోచించి వాస్తవాలు చెప్పమన్నారు.  ఇంజనీరింగ్ ఫీజులు లక్షల్లో ఉన్నాయి. అయితే, బాబు మాత్రం ముష్టివేసినట్లు 35వేలు ఇస్తున్నారని మండిపడ్డారు. బాబు హయాంలో  పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు చదివించే స్థాయి మనకు ఉందా?అని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.  నాన్నగారు వచ్చి ఒకడుగు ముందుకు వేసి పేదవాళ్ల జీవితాల్లో చిరునవ్వులు తెచ్చారు. మళ్లీ ఇప్పుడుచంద్రబాబు వచ్చారు... పిల్లల్ని చదివించే పరిస్థితి లేదన్నారు. ఈ పరిస్థితులు అన్నీ మారుస్తూ ప్రతిపేదవాడికీ తోడుగా ఉండేలా చేస్తామనీ. నవరత్నాలు ప్రకటించామనీ వివరించారు. 

మీ పిల్లల్ని బడులకు పంపిస్తే.. వారు పెద్ద చదువులు చదివితే పేదరికం నుంచి బయటపడతారు. అప్పుడే బతుకులు మారుతాయి. అందుకే.. ప్రతి తల్లికి భరోసా ఇస్తున్నామనీ చెప్పారు.  ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తామనీ, వెయ్యి రూపాయలకు మించి ఖర్చయ్యే ఏ వైద్యమైనా సరే ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఆపరేషన్ అయ్యాక రెండు, మూడు, ఆరు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తే ఆ సమయంలో డబ్బు ఇస్తామని  మరోసారి  ప్రకటించారు. బెంగులూరు, చెన్నై, హైదరాబాద్  ఎక్కడ వైద్యం చేయించుకున్నా  ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామని స్పష్టం చేశారు.  దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి మందుల ఖర్చు పెరుగుతోంది. అలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి పింఛను రూ.10వేలు  ఇస్తామని ప్రకటించారు.

అవ్వా, తాతలకు వయస్సు పెరిగే కొద్దీ మందుల అవసరమూ ఉంటుంది. వారికి ఫించను మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పనులకు వెళ్తే తప్ప కడుపు నిండని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. పింఛను రెండువేలు ఇవ్వటమే కాక వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

ఇమాం మౌజీలకు వేతనాలు పెంచుతాం

 ఇమామ్, మౌజీలకు చంద్రబాబు ప్రకటించిన ఏదీ ఇవ్వటం లేదు. ఇమాంలకు పదివేలు, మౌజీలకు 5వేలు ఇస్తామన్నారు. మసీదు, చర్చి, గుడి అయినా ప్రభుత్వం నుంచి తోడ్పాటు ఇస్తామని  వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.  ఒక్కోదానికి 15వేలు ఇచ్చి తోడుగా ఉంటామన్నారు. ఏ మనిషి అయినా గుడికి పోవాలి. చర్చికి, మసీదుకు పోవాలి. దేవుడిని ప్రార్థించినప్పుడు మంచి, చెడు తెలుస్తుంది. ఆ ద్వారం మూసుకోకూడదని అన్నారు. మనకు మంచి చేయటం కోసం.. సందేశాలు ఇచ్చేవారు సంతోషంగా ఉండేందుకు .. తోడుగా ఉంటామన్నారు. మీ అందరి నుంచి సూచనలు, సలహాలు ఇవ్వమని జగన్ కోరారు.

Back to Top