అంతిమ విజయం న్యాయానిదే: విజయమ్మ

హైదరాబాద్, 28 మే 2013:

న్యాయమే ఎప్పటికైనా తుది విజయం సాధిస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ధీమాగా చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయంవైపే విజయం నిలుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డికి కచ్చితంగా బెయిల్ వస్తుందని ఆమె‌ ధీమాగా చెప్పారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కూడా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి అక్రమ నిర్బంధానికి నిరసనగా మంగళవారం ఇందిరాపార్కు వద్ద శ్రీమతి విజయమ్మ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబిఐ ఇంకా ఎన్ని ఛార్జిషీట్లు వేస్తుందని ప్రశ్నించారు. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ‌మరణించిన తర్వాత తమ కుటుంబం ఎన్నో బాధలు పడిందన్నారు. తాము మానసికంగా కుంగిపోతుంటే కొందరు ఆనందిస్తున్నారని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు.

విశ్వసనీయత, విలువలు, మాట మీద కట్టుబడి ఉండలేని చంద్రబాబుకు తమను విమర్శించే హక్కు ఎక్కడిదని శ్రీమతి విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబుకు విశ్వసనీయత ఉంటే తెలుగుదేశం పార్టీ అలా ఉండేది కాదన్నారు. టిడిపి, కాంగ్రెప్‌ పార్టీలు కలిసి చేస్తున్న కుట్రలను ప్రజలు బాగా అర్థం చేసుకున్నారని శ్రీమతి విజయమ్మ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ ఘన విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Back to Top