వైయ‌స్ఆర్ సీపీ ఆధ్వ‌ర్యంలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు

విజయవాడ: మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దివంగత నేతను స్మరించుకుంటూ.. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. విజయవాడలోని గొల్లపూడిలో వైయ‌స్సార్‌సీపీ నేతలు పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంత, సురేష్‌, ధూళిపాళ్ల శ్రీనాథ్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top