వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్, వైయస్ జగన్..ఇద్దరిదీ ఒకే విజన్
16 Jul 2021 4:18 PM
వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి
తూర్పు గోదావరి: అభివృద్ధి, సంక్షేమం పట్ల దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిలది ఒకే రకమైన విజన్ అని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, టీటీడీ పూర్వపు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రి జీజీహెచ్ సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైవీ సుబ్బారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం పెద్దాపురం లలితా రైస్ ఇండస్ట్రీ వారు నిర్మించిన కళ్యాణమండపం, ప్రసాదం తయారి కేంద్రాన్ని వైవీ సుబ్బారెడ్డి దంపతులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2 లక్షల 60 వేల కోట్లు అప్పులు చేసి వెళ్లిందని మండిపడ్డారు. పాలన గాడిన పడేలోపే కరోనా సంక్షోభం వచ్చిందని, అయినా సరే సీఎం వైయస్ జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నామని తెలిపారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రైతుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మేలు చేస్తోందన్నారు. సీఎం వైయస్ జగన్ కృషితోనే కృష్ణా జలాల విషయంలో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు.