నేడు వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ సమావేశం 

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యులతో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. 
సమకాలీన రాజకీయ అంశాలు, బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ(రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో) కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో వైయ‌స్‌ జగన్‌ చర్చించనున్నారు.

Back to Top