వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రధానిని కలిసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు
11 Aug 2021 1:28 PM
న్యూఢిల్లీ: దేశ ప్రధాన మంత్రిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బుధవారం పార్లమెంట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని ఎంపీలు కోరారు. దిశ బిల్లు అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. హోంశాఖ, న్యాయశాఖలకు దిశ బిల్లు వివరాలు ఇప్పటికే అందజేశాం. మహిళలు, శిశువులకు రక్షణ కల్పించేలా దిశ బిల్లు రూపొందించాం. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లోనే శిక్షపడేలా బిల్లు ఉంది. మహిళా సంక్షేమానికి సీఎం వైయస్ జగన్ ఎంతగానో కృషిచేస్తున్నాకని ప్రధానికి ఎంపీలు వివరించారు. ప్రధానిని కలిసిన వారిలో వైయస్ఆర్సీపీ పార్లమెంట్ చీఫ్ విప్ మార్గాని భరత్, మహిళా ఎంపీలు జీ.మాధవి, వంగా గీతా ,చింతా అనురాధ, వెంకట సత్యవతి ఉన్నారు.